వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆంధ్రావాళ్ళు సినిమాలు తీయకపోతే తెలంగాణ హాల్స్ గోడవున్లే'

By Santaram
|
Google Oneindia TeluguNews

Telangana
చెన్నై: ఆంధ్ర-తెలంగాణ వివాదం సినిమా పరిశ్రమను ఇంకా కుదిపేస్తూనే ఉంది. ఆంధ్రావాళ్లు సినిమాలు తీయకపోతే తెలంగాణలోని థియేటర్లన్నీ గోడౌన్లుగా మారడం ఖాయమని ప్రముఖ నిర్మాత, దక్షిణ భారత ఫిల్మ్‌ చాంబర్‌ గౌరవ కా ర్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. తెలుగు చలనచిత్ర సీమలో దిగ్గజాల వంటి ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, మల్లెమాల వంటి ప్రముఖులను తెలంగాణ వాదులు కించపరచడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

తెలుగువారు సమైక్యంగా ఉంటేనే ఉత్తరాది పాలకులు వివక్ష చూపుతున్నారని గుర్తుచేశారు. తాజాగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో ఫిలిం చాంబ ర్‌ సిఫారసుచేసిన అంజలీదేవి వంటి దిగ్గజానికి స్థానందక్కలేదన్నారు. అలాంటిది విడిపోతే మరింత బలహీనపడతామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యవాదం విన్పిస్తున్న ఆంధ్రులు తీసిన సినిమాలను తెలంగాణలో ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ సినిమాల ప్రదర్శనకు అడ్డంకులు తొలిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X