ప్రముఖ నటుడు గుమ్మడి కన్నుమూత

గుమ్మడి 1942లో ఆయన తొలిసారిగా ఒక నాటకం కోసం ముఖానికి రంగు వేసుకున్నాడు. ఆయన 1950లో అదృష్టదీపుడు చిత్రం ద్వారా చిత్రసీమలో అడుగు పెట్టారు. ఆయన చివరి సినిమా ఆయనకిద్దరు. ఆయన పౌరాణికాలు, సాంఘికాలు అన్ని పాత్రలూ పోషించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు 1989లో గౌరవ డాక్టరేట్ వచ్చింది. కులదైవం, మా ఇంటి మహాలక్ష్మి, మాహా మంత్రి తిమ్మరుసు, కులగోత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. మహా మంత్రి తిమ్మరుసుకు ఆయన జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డు అందుకున్నారు. ఆయన ఏడు సార్లు నంది అవార్డులు అందుకున్నారు.












Click it and Unblock the Notifications