వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి మమ్మల్ని పిలువలేదు: జానా రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: తమను ఢిల్లీకి ఎవరూ ఆహ్వానించలేదని, తమంత తామే వచ్చామని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు కె.జానా రెడ్డి చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆహ్వానించడంతో జానారెడ్డి, మరో మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. అయితే తమను ఎవరూ ఆహ్వానించలేదని, సొంత పని మీద ఇక్కడికి వచ్చామని జానా రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము సోనియా అపాయింట్ మెంటు కోరలేదని దామోదర్ రెడ్డి చెప్పారు. సోనియా అపాయింట్ మెంటు ఇస్తే తాము కలుస్తామని ఆయన చెప్పారు.

తాము ఢిల్లీలో రెండు, మూడు రోజులుంటామని ఆయన చెప్పారు. సోనియా అడిగితే తెలంగాణలోని పరిస్థితులను, విద్యార్థుల ఆత్మహత్యలను వివరిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రకటన చేయాలని తాము కోరుతామని ఆయన చెప్పారు. కమిటీ వేసినా ఫరవాలేదని, అయితే దానికి కూడా నిర్దిష్టమైన కాలపరిమితి ఉండాలని ఆయన అన్నారు. కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నామని ఆయన చెప్పారు. రాజీనామాలకు తెలంగాణ జెఎసి గడువు ఈ నెల 28వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు నేతలు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు కేశవరావు, హనుమంతరావు చర్చలు జరుపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X