స్పష్టత వచ్చే వరకు ఆందోళనలు: కోదండరామ్

తెలంగాణపై స్పష్టత, కాల పరిమితి కోసం సాగిస్తున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 5వ తేదీన నల్లగొండ జిల్లాలోని కోదాడ నుంచి హైదరాబాదు వరకు మానవహారం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కమిటీని స్వాగతించడం, స్వాగతించకపోవడం కూడా దాని విధివిధానాల మీదనే ఆధారపడి ఉంటుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే కమిటీ ఏర్పాటును ఒక ముందడుగుగానే భావిస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ జెఎసిలో ఉందని, జెఎసిలో ఉంటామని చెప్పిందని ఆయన అన్నారు. కాంగ్రెసు జెఎసిలో కొనసాగడంపై తమకైతే అనుమానాలు లేవని ఆయన అన్నారు. అయితే జెఎసి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే బాగుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications