వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు లోయలో పడి ముగ్గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Srisailam
శ్రీశైలం: శ్రీశైలంలో టూరిస్టు బస్సు లోయలో పడడంతో ముగ్గురు మరణించారు. యాభై మంది ప్రయాణికులు గల టూరిస్టు బస్సు గురువారం ఉదయం శ్రీశైలం చెక్ పోస్టు వద్ద టూరిస్టు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో బస్సు డ్రైవర్ ఉన్నాడు. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి శ్రీశైలానికి వచ్చినట్లు సమాచారం. గాయపడిన వారిని సున్నిపెంట ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. చెక్ పోస్టు వద్ద వాహానాలు అతి తక్కువ వేగంతో నడుస్తాయని, కానీ ఈ బస్సు వేగంగా వచ్చిందని అంటున్నారు. వేగంగా వచ్చిన వాహనాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయారని, ప్రయాణికులంతా ఆ సమయంలో నిద్రమత్తులో ఉన్నారని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X