బస్సు లోయలో పడి ముగ్గురు మృతి

Srisailam
శ్రీశైలం: శ్రీశైలంలో టూరిస్టు బస్సు లోయలో పడడంతో ముగ్గురు మరణించారు. యాభై మంది ప్రయాణికులు గల టూరిస్టు బస్సు గురువారం ఉదయం శ్రీశైలం చెక్ పోస్టు వద్ద టూరిస్టు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో బస్సు డ్రైవర్ ఉన్నాడు. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి శ్రీశైలానికి వచ్చినట్లు సమాచారం. గాయపడిన వారిని సున్నిపెంట ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. చెక్ పోస్టు వద్ద వాహానాలు అతి తక్కువ వేగంతో నడుస్తాయని, కానీ ఈ బస్సు వేగంగా వచ్చిందని అంటున్నారు. వేగంగా వచ్చిన వాహనాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయారని, ప్రయాణికులంతా ఆ సమయంలో నిద్రమత్తులో ఉన్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+