వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైబర్ బోటు బోల్తా:పలువురు గల్లంతు

By Pratap
|
Google Oneindia TeluguNews

Godavari River
ఏలూరు: బియ్యపుతిప్ప, తాండవ పడవ ప్రమాదాలను మరిచిపోక ముందే మరో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం టేకూరు వద్ద ఫైబర్ బోటు బోల్తా వడింది. దీంతో పలువురు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ఈ పడవలో 20 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. అధికారులు సహాయక చర్యలకు దిగారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నారు. టేకూరు నుంచి కొరటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

బోటు ప్రమాదంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మత్స్యకారులే గల్లంతైనట్లు వార్తా కథనాలు వెలువడుతుండగా, పాపికొండల విహార యాత్రలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భద్రాచలం నుంచి యాత్రికులు వచ్చినట్లు చెబుతున్నారు. బోటు మునిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ఎస్పీ మహేష్ భగవత్ చెబుతున్నారు. భద్రాచలం ప్రాంతంలో అంతా గాలించామని, ప్రమాద ఆచూకీ ఏదీ లేదని ఆయన అన్నారు. రెండు ప్రమాదాల గురించి వార్తాకథనాలు వెలువడ్డాయా, ఒకే ప్రమాదం గురించి వెలువడ్డాయా అనేది తెలియడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X