వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్యవైశ్యులకు నాకూ పెద్ద తేడాలేదు: జగన్
మంత్రి అహ్మదుల్లా మాట్లాడుతూ తనకు స్నేహితులందరూ ఎక్కువగా వైశ్యులే ఉన్నారని వారు రాజకీయాల్లో తప్పకుండా ఎదగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మేయర్ పి. రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అవకాశం ఉన్నచోట సీట్లిచ్చి గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ బ్రతికుండగా ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న ఆర్యవైశ్య ట్రస్టులను వారే పరిపాలించుకునేలా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. అలాంటి వైఎస్ కుటుంబాన్ని తామెన్నడూ మరచిపోమన్నారు.
Story first published: Thursday, February 4, 2010, 15:35 [IST]