వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ సిఎంను నేనే: జానారెడ్డి
శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లాలో ఆందోళనకారులు ఆయనను అడ్డుకున్నారు. శ్రీకృష్ణ కమిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని అంటూ తెలంగాణ ఏర్పడితే తానే ముఖ్యమంత్రిని అవుతానని, అందువల్ల తెలంగాణ రాకూడదని తాను ఎందుకు కోరుకుంటానని, తెలంగాణను సాధించి తీరుతానని ఆయన అన్నారు. తిరిగి అదే మాటను హైదరాబాద్ వచ్చిన తర్వాత శుక్రవారం రాత్రి, మళ్లీ శనివారం అన్నారు.
Comments
Story first published: Saturday, February 13, 2010, 11:42 [IST]