వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయంత్రంలోగా జెఎసి తేల్చాలి: ఈటెల

By Pratap
|
Google Oneindia TeluguNews

Etala Rajender
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను శనివారం సాయంత్రంలోగా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలంగాణ జెఎసికి అల్టిమేటం ఇచ్చింది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నందున రాజీనామాలు చేయాలని తాము నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని, ఈ విషయంలో జెఎసి మిగతా పార్టీల తెలంగాణ నాయకుల వైఖరిని తేల్చాలని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. రాజీనామాలు చేయాలని తెరాస ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని మిగతా పార్టీల నాయకులు నిరసించడంతో జెఎసి కన్వీనర్ శనివారం ఉదయం తెరాస నాయకులతో చర్చించారు. ఈ చర్చల అనంతరం ఈటేల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.

తాము జెఎసి సమావేశానికి హాజరవుతామని, తమ పార్టీ వైఖరిని వెల్లడిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకే రాజీనామాల విషయంలో గడువులు పెంచుతూ వచ్చామని, శ్రీకృష్ణకమిటీ విధివిధానాలు చూసిన తర్వాత రాజీనామాలపై నిర్ణయం తీసుకుందామని కాంగ్రెసు నాయకులు చెప్పడంతో ఇంత కాలం ఆగామని ఆయన చెప్పారు. విధివిధానాలు తెలంగాణ ప్రజల కంట్లో మట్టి కొట్టే విధంగా ఉన్నాయని, దీంతో పదేళ్లుగా ఉద్యమాన్ని నిర్మించుకుంటూ వచ్చిన పార్టీగా తమపై ఎక్కువ బాధ్యత ఉందనే తలంపుతో రాజీనామాలు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని, తమకు ప్రజలే హైకమాండ్ అని, ప్రజల అభిప్రాయం మేరకు రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందామని కోదండరామ్ చెప్పడంతో రేపటి వరకు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X