హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైనంపల్లి రాజీనామా ఉపసంహరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తెలుగుదేశం మెదక్ శానససభ్యుడు మైనంపల్లి హనుమంత రావు శాసనభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను సోమవారం ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు తాను రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

మైనంపల్లి హనుమంతరావు ఆదివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలోని విఐపి రిజర్వ్ డ్ లాంజ్ లో తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ సాధన కోసం తాను రాజీనామాను చేస్తున్నట్లు ప్రకటించి ఆ మేరకు రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసి తన స్థానంలో తెలంగాణ కోసం మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకర్ని నిలబెట్టి గెలిపించుకుంటానని చెప్పారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తాజా మాజీ శాసనసభ్యులు కూడా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తమ స్థానాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే తెలంగాణకు చెందిన 39 మంది తెలుగుదేశం సభ్యులు రాజీనామా చేసి అదే విధంగా చేస్తామంటే తాము సిద్ధంగా ఉంటామని తెరాస నాయకులు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X