Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రి వర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోలేదు: సిఎం

Rosaiah
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఇంత వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. ఏప్రిల్ 4వ తేదీన మంచి ముహూర్తం ఉంటే ఆ రోజు మంచి పనులు చేద్దామని ఆయన అన్నారు. ఏప్రిల్ 4వ తేదీన మంచి ముహూర్తం ఉన్నందున మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే వార్తా కథనాలపై ఆయన ఆ విధంగా అన్నారు. ఆయన బుధవారం శాసనసభ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పై అందరూ కోరేదే చేస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రణాళికా సంఘం తప్పు పట్టిందనే వార్తల్లో నిజం లేదని, సంక్షేమ పథకాలను ప్రణాళికా సంఘం తప్పు పట్టలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అపాలని అడిగే అధికారం ప్రణాళికా సంఘానికి లేదని, అన్ని పథకాలు యధావిధిగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ పథకాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతున్నాయని మాత్రమే ప్రణాళికా సంఘం వ్యాఖ్యానించిందని ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+