విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో ప్రేమజంట ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పర్యాటక శాఖకు చెందిన పున్నమి రిసార్టులో ప్రేమికులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమికులను పల్లవి, శరత్ గా గుర్తించారు. వీరు ప్రకాశం జిల్లా ఉల్లవపాడుకు చెందినవారు. పల్లవికి వివాహమైంది. ఆమెకు పిల్లలున్నారు. శరత్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరు గురువారం రాత్రి విజయవాడకు వచ్చి పున్నమి రిసార్టులో దిగారు.

కాలేజీ రోజుల్లో వారిద్దరు ప్రేమికులను తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత మాట్లాడుకోవడానికో, మరి దేనికో విజయవాడలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఓ సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టారు. తాము జీవితంలో ఎప్పుడూ కలవలేమనే నిరాశను ఆ లేఖలో వారు వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X