హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపిపిఎస్సీ అక్రమాలపై అసెంబ్లీలో గొడవ

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: ఎపిపిఎస్సీ అక్రమాలపై శనివారం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఎపిపిఎస్సీ అక్రమాలపై తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. రైతులకు అందించే ఉచిత విద్యుత్తులో కోతపై ప్రజారాజ్యం, కరువు, మంచినీటి ఎద్దడి, విద్యుత్ కోతపై బిజెపి వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. ఈ వాయిదా తీర్మానాలను స్పీకర్ కె కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. అయితే ఎపిపిఎస్సీ అక్రమాలపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి.

స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంతగా నచ్చజెప్పినప్పటికీ తెలుగుదేశం సభ్యులు వినిపించుకోలేదు. ఎపిపిఎస్సీలో అవినీతి, అక్రమాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X