వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్కోలో పేలుళ్లు: 41 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Moscow Metro Station
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో రెండు వరుస పేలుళ్లు సంభవించాయి. మాస్కోలోని లూబియాంకా మెట్రో స్టేషన్ పేలుడుతో దద్ధరిల్లింది. ఈ ఘటనలో 26 మంది మరణించినట్లు, మరో 15 మంది గాయపడినట్లు సమాచారం. ఇతార్ - తాస్ న్యూస్ ఏజెన్సీ ఈ మేరకు తెలిపింది.

మృతులంతా ప్రయాణికులేనని తెలుస్తోంది. ఈ పేలుళ్లకు ఉగ్రవాదులే పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. లూబియాంకా మెట్రో స్టేషన్ లో రైలులోని వ్యాగన్ లో పేలుళ్లు సంభవించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వ్యాగన్ లో 14 మంది, ప్లాట్ ఫారం మీద 12 మంది మరణించినట్లు చెబుతున్నారు. వివరాలు అందాల్సి ఉంది.

పార్క్ కుల్తిర్తీ మెట్రో స్టేషన్ లో మరో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 15 మంది మరణించారు. పేలుళ్లకు కారణమేమిటో వెంటనే తెలియతడం లేదు. అయితే ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X