కొత్త లడ్డూ కౌంటర్లతో కొత్త ఇబ్బందులు

ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన కొత్త లడ్డూ పథకంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా దళారులకు చేతినిండా పనిదొరికింది. ధర్మదర్శనానికి వెళ్లే సామాన్య భక్తులకు రూ.10 చొప్పున రెండేసి లడ్డూలు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోనే మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం 4 లడ్డూలు మంజూరు చేసే విధంగా టీటీడీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. లడ్డూలు పొందేందుకు ఆలయం వెలుపల భక్తులు గంటల సమయం వెచ్చించాల్సి వస్తోంది. సుమారు రెండు గంటలకుపైగా నిరీక్షించి లడ్డూ పడి టికెట్టు పొందుతున్నారు. తిరిగి ఆ టోకెన్లపై లడ్డూలు పొందేందుకు మరోసారి కూడా క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఎలాంటి వేలి ముద్ర, ఫొటో తీసే అవకాశం లేకపోవడం వల్ల లడ్డూలు పొందిన వ్యక్తులే తిరిగి పొందుతుండడం గమనార్హం.
ఆలయం వెలుపల నేరుగా రూ.100 చెల్లించి 4 లడ్డూలు పొందేలా కొత్త సౌకర్యం కలగడంతో దళారులకు వరంగా మారింది. భక్తుల ముసుగులో దళారులు క్యూలైన్లలో నిలబడి అదనపు లడ్డూలు పొందుతున్నారు. మరోవైపు టికెట్లు మంజూరు చేసే కౌంటర్ వద్ద భద్రతా, ఇతర సిబ్బంది సిఫారసులు పెరిగిపోయాయి. తమవారికైతే క్యూతో సంబంధం లేకుండానే లడ్డూ టోకెన్లు మంజూరు చేస్తుండడం గమనార్హం. ఈ విషయంలో అన్ని వర్గాలూ ముందు వరుసలోనే ఉన్నారు. కొంతమంది సిబ్బందిని మచ్చిక చేసుకున్న దళారులు గుట్టుచప్పుడు కాకుండా తమ పనిని కానిచ్చేస్తున్నారు. భక్తుల అవసరం తగ్గట్టుగా సొమ్ము చేసుకుంటున్నారు.
ధర్మదర్శనానికి వెళ్లే భక్తులకు మంజూరు చేస్తున్న లడ్డూ కౌంటర్లలోనే రూ.25 చొప్పున అదనపు లడ్డూలు మంజూరు చేస్తేనే సౌకర్యంగా ఉంటుందని భక్తులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే నిజమైన భక్తులకే సమయం వృథా కాకుండా అదనపు లడ్డూలు పొందే అవకాశం కలుగుతుంది. పటిష్ట భద్రతా చర్యల మధ్య ఇక్కడే టోకెన్లు మంజూ రు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సర్వత్రా వ్యక్తమవుతోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications