పాతబస్తీలో పరిస్థితి అదుపులో ఉంది: సబిత

Sabitha Indra Reddy
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అల్లర్లు జరిగిన పాతబస్తీ ప్రాంతాల్లో సోమవారం ఉదయం పర్యటించి వచ్చిన అనంతరం ఆమె శాసనసభలో ప్రకటన చేశారు. తాను పాతబస్తీలో పర్యటించి వచ్చానని, పరిస్థితి అదుపులోనే ఉందని ఆమె అన్నారు. ప్రశాంత వాతావరణ కల్పనకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆమె అన్నారు. పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యేందుకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నామని ఆమె చెప్పారు. ప్రశాంత వాతావరణ కల్పనకు ప్రతిపక్షాలు సహకరించాలని ఆమె కోరారు.

హైదరాబాదులో చాలా రోజుల తర్వాత ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని పరిరక్షించడానికి సహకరించాలని ఆయన కోరారు. తాను ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకుంటానని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. అయినా సభ సద్దుమణగలేదు. దీంతో సభను 15 నిమిషాల పాటు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+