పాట్నా: బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలోని యదుపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. దాదాపు 50 మందికిపైగా నక్సల్స్ భవనం చుట్టుపక్కల డైనమైట్లు అమర్చి పేల్చివేసినట్టు తెలుస్తోంది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారి కోసం గాలింపు మొదలుపెట్టినట్టు పోలీసులు తెలిపారు.