హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎకరం రూపాయి, రోశయ్య మాయ: గాలి ఆరోపణ

By Santaram
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్‌: అపాచీ కంపెనీకి భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌.30ని తక్షణమే రద్దు చేయాలని టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రూ.30 కోట్ల విలువైన 90 ఎకరాల భూమిని ఎకరా రూపాయి చొప్పున ప్రభుత్వం విక్రయించి అవినీతికి పాల్పడిందన్నారు.

ఈ అవినీతిలో ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రి కన్నా లకీనారాయణకు రూ.15 కోట్లు ముడుపులు అందాయని ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. రూపాయికి ఎకరా చొప్పున 93 ఎకరాల భూమిని కంపెనీకి రిజిస్టర్‌ చేయాలంటూ జీవోను సర్కార్‌ విడుదల చేయటం అవినీతికి పరాకాష్ట అన్నారు. భూ అమ్మకాన్ని నిలిపివేసి, జీవోను రద్దు చేయాలని గాలి డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X