Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీస్ లదే తప్పని తేల్చిన ప్రెస్‌ కౌన్సిల్‌ నివేదిక

Osmania University
హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీలో జర్నలిస్టులపై జరిగిన దాడికి సంబంధించిన ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విచారణ పూర్తి చేసిన పీసీఐ ఈ ఘటనపై నలుగురు పోలీసు అధికారుల తీరును తప్పుబట్టింది. జాయింట్‌ కమిషనర్‌ రామాంజనేయులు, ఈస్ట్‌ జోన్‌ డీసీపీ మహేష్‌ చంద్ర లడ్హా, ఏసీపీ కె రామచంద్ర, సీఐ అంజయ్యలపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసింది. భవిష్యత్‌ లో ఈ నలుగురికి మీడియాతో సంబంధంలేని పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.

అలాగే పోలీసుల దాడిలో గాయపడ్డ జర్నలిస్టుల ఖర్చు, ధ్వంసమైన సామాగ్రీ పరిహారం ప్రభుత్వమే చెల్లించాలని పీసీఐ సిఫారసు చేసింది. ధ్వంసమైన మీడియా వాహనాలు, పరికరాలకు పరిహారం ఇవ్వాలంది. ఈ నివేదికను శాసనసభలో చర్చించాలని ప్రభుత్వాన్ని ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కోరింది. పోలీస్‌ శాఖ ఓ నోడల్‌ అధికారిని నియమించుకోవాలని, మీడియాతో ఆ అధికారి ద్వారా సంప్రదింపులు జరపాలని నివేదిక తెలిపింది. కాగా రెచ్చగొట్టే దృశ్యాలను పదేపదే ప్రసారం చేయరాదంటూ ఛానళ్లకు పీసీఐ సూచించింది. ఈ నివేదకను ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 17న ముఖ్యమంత్రికి సమర్పించనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+