ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజలు ఆదరిస్తున్నారు: జగన్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఖమ్మం: తనను ప్రజలు ఓ కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తున్నారని, వారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలనని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. ఆయన మంగళవారం ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వైయస్ ఆకస్మిక మృతితో దిగ్భ్రాంతికి గురై మరణించినవారి కుటుంబాలను పరామర్శించారు. ఆయన కొన్ని చోట్ల మాత్రమే మాట్లాడారు. మరికొన్ని చోట్ల తాను మాట్లాడలేకపోతున్నందుకు క్షమించాలని కోరారు.

ఖమ్మం జిల్లాలో జగన్ యాత్రకు తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ముందుస్తుగా పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అయినా జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాన వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. సమైక్యాంధ్ర వద్దు, తెలంగాణ ముద్గు, వైయస్ జగన్ గోబ్యాక్ అనే నినాదాలు గల ప్లకార్డులను ప్రదర్సించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X