వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విస్తరణపై రోశయ్యకు ఆశాభంగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఆశాభంగమే కలిగింది. మంత్రివర్గ విస్తరణకు గానీ పునర్వ్యస్థీకరణకు గానీ కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. ఈ విషయం నిరవధికంగా వాయిదా పడినట్లే. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో, పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో ఆయన బుధవారం విడివిడిగా సమావేశమయ్యారు. ఫలితం లేకపోయింది. తాను సోనియాతోనూ, మొయిలీతోనూ మంత్రివర్గ విస్తరణపై మాట్లాడలేదని ఆయన మొయిలీతో సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మంత్రివర్గ విస్తరణ తన ఎజెండాలో లేదని ఆయన చెప్పారు. విస్తరణ ప్రచారం మీడియాదేనని ఆయన అన్నారు.

నాలుగు శాఖలు ఖాళీగా ఉన్నాయి కదా అని మీడియా ప్రతినిధులు అంటే చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు అదనంగా ఓ శాఖను కేటాయించారని, ఓ గంట ఎక్కువగా పని చేసేవాడినని ఆయన చెప్పారు. కాస్తా ఎక్కువ సమయం పని చేస్తానని ఆయన చెప్పారు. సోనియాతోనూ మొయిలీతోనూ తాను శాసనమండలి, మున్సిపల్ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికలపై చర్చించినట్లు రోశయ్య తెలిపారు. మూడు శాసన మండలి సీట్లకు అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేస్తుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X