థరూర్ గొడవపై ప్రణబ్ ప్యానెల్ విచారణ

Pranab Mukherjee
న్యూఢిల్లీ: ఐపియల్ చైర్మన్ లలిత్ మోడీ, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశి థరూర్ వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్యానెల్ విచారించనుంది. సమస్య పరిష్కారానికి ప్రణబ్ ప్యానెల్ నడుం బిగించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటన నుంచి తిరికి వచ్చే వరకు థరూర్ పై ఏ విధమైన చర్యలు తీసుకోకూడదని యుపిఎ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో శశి థరూర్ పై ప్రతిపక్షాలు పార్లమెంటులో చేసే ఆరోపణలను తిప్పి కొట్టేందుకు ప్రణబ్ ముఖర్జీ సమాయత్తమయ్యారు.

కోచి జట్టు భాగస్వాములను వెల్లడించకూడదని థరూర్ మోడీని కోరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో థరూర్ కు, లలిత్ మోడీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వారిద్దరు తమ తమ మాటలకే కట్టుబడి ఉన్నారు. ఎవరు కూడా మెట్టు దిగడం లేదు. రాండివూ స్పోర్ట్స్ నిజమైన యజమానలెవరనేది వెల్లడించకూడదని థరూర్ తనను కోరినట్లు మోడీ ఆరోపిస్తున్నారు. కోచి జట్టుకు సంబంధించిన పేవర్ పనులు త్వరగా పూర్తి చేయాలని మాత్రమే తాను మోడీని అడిగిటన్లు థరూర్ చెబుతున్నారు. అయితే, ప్రతిపక్షాలు థరూర్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిందుకు సిద్ధపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+