వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థరూర్ ప్రకటనను అడ్డుకున్న విపక్షాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Shashi Tharoor
న్యూఢిల్లీ: ఐపియల్ వివాదంలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశి థరూర్ వ్యవహారంపై శుక్రవారం లోకసభ అట్టుడికింది. తనపై వచ్చిన ఆరోపణల మీద శశి థరూర్ లోకసభలో ప్రకటన చేయడానికి పూనుకున్నారు. అయితే ఆయనను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దాంతో తన ప్రకటనను ఆయన సభ ముందుంచారు. రాజ్యసభలో కూడా శశిథరూర్ వ్యవహారంపై దుమారం చెలరేగింది. దీంతో పార్లమెంటు ఉభయ సభలు కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.

శశి థరూర్ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, పార్టీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ లతో ఆమె సంప్రదింపులు జరిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X