థరూర్ ప్రకటనను అడ్డుకున్న విపక్షాలు

Shashi Tharoor
న్యూఢిల్లీ: ఐపియల్ వివాదంలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశి థరూర్ వ్యవహారంపై శుక్రవారం లోకసభ అట్టుడికింది. తనపై వచ్చిన ఆరోపణల మీద శశి థరూర్ లోకసభలో ప్రకటన చేయడానికి పూనుకున్నారు. అయితే ఆయనను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దాంతో తన ప్రకటనను ఆయన సభ ముందుంచారు. రాజ్యసభలో కూడా శశిథరూర్ వ్యవహారంపై దుమారం చెలరేగింది. దీంతో పార్లమెంటు ఉభయ సభలు కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.

శశి థరూర్ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, పార్టీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ లతో ఆమె సంప్రదింపులు జరిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+