వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ యాత్ర తెలంగాణపై దాడి: జెఎసి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ యాత్ర చేయడం ఉద్యమంపై దాడి చేయడమేనని తెలంగాణ జేఏసీ అభిప్రాయపడింది. అవసరం లేనిచోట, అనువు కాని సమయంలో యాత్ర చేపట్టడం ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టడమేనని వ్యాఖ్యానించింది. జగన్ యాత్రను తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి సీమాంధ్ర నాయకులు కలిసి పన్నిన కుట్రగా జేఏసీ నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, పిట్టల రవీందర్, అద్దంకి దయాకర్ తదితరులు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అభివర్ణించారు. జగన్ యాత్ర సందర్భంగా ఖమ్మం జిల్లాలో జేఏసీ నేతలపై లాఠీచార్జి చేయడం, వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే జగన్ యాత్ర చేపట్టారని ఆరోపించారు. తెలంగాణపై వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని వారు జగన్ ను డిమాండ్ చేశారు. జగన్ ఇప్పటికీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటే తెలంగాణలో పర్యటించవద్దని ఆయన అన్నారు. భవిష్యత్తులో జగన్ యాత్రకు తెలంగాణలో అనుమతి ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. యాత్రను ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటారని, ముందుకు సాగనివ్వరని చెప్పారు. జగన్ యాత్ర ద్వారా ప్రజల మనసు గెల్చుకోవడం అటుంచి వ్యతిరేకత ఏర్పడుతోందని ఏలికలు గుర్తించాలన్నారు.

వైఎస్ జగన్ నిర్వహిస్తున్నది ఓదార్పు యాత్ర కాదని, అది పూర్తిగా రాజకీయ లబ్ధి పొందే దోపిడీ యాత్ర అని ఓయూ జెఎసివిమర్శించింది. నాడు తెలంగాణలో పర్యటించిన రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ భూములను తెగనమ్మి దోపిడీ చేస్తే నేడు ఆయన కొడుకు వైఎస్ జగన్ పర్యటన తెలంగాణ గనులను, ఖనిజాలను, నీటి వనరులను దోపిడీ చేయడానికేనని జాక్ ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X