హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పంతా తీగల కృష్ణారెడ్డిదే: నన్నపనేని

By Pratap
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
హైదరాబాద్: తన వ్యాఖ్యల వల్ల పార్టీకి ఏ విధమైన నష్టం వాటిల్ల లేదని, తమ పార్టీ నాయకుడు తీగల కృష్ణా రెడ్డి వ్యాఖ్యల వల్లనే ఇంతటి రాద్ధాంతం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. పైరవీ కారులకే పార్టీలో పదవులు దక్కుతున్నాయని నన్నపనేని రాజకుమారి చేసిన ప్రకటన తీవ్ర దుమారం చెలరేగింది. మంగళవారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు తాన హైదరాబాద్ వచ్చినట్లు ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

ఆమె సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి ఎల్లుండి యనమల రామకృష్ణుడు, గరికిపాటి రామ్మోహన్ రావులను కలుస్తానని ఆమె చెప్పారు. ఈ ద్విసభ్య కమిటీ ఎదుట హాజరవుతానని ఆమె చెప్పారు. పార్టీలో పనిచేసేవారికి పదవులు దక్కడం లేదని ఆమె గుంటూరులో ఇటీవల విమర్శలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X