ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ మార్గం శిరోధార్యం: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
ఒంగోలు: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మార్గమే తనకు శిరోధార్యమని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. తన సొంత జిల్లా ప్రకాశంలోని వేటపాలెం మండలం కటారివారిపల్లెలో ఆయన సోమవారం ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలను కొనసాగించడమే తన ముందున్న లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజాపథం కార్యక్రమాన్ని సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రజాపథానికి మించిన మంచి పథకం మరోటి లేదని ఆయన అన్నారు. ఆరేళ్లుగా ప్రజలు తమకు అండగా ఉండి తమ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆయన అన్నారు. అందుకు తమ వంతు బాధ్యతగా ప్రజలకు మంచి భవిష్యత్తును అందిస్తామని ఆయన చెప్పారు.

తనకు తొలుత ఆటంకాలు ఎదురయ్యాయని, మనో ధైర్యం వల్ల, ప్రజల సహకారం వల్ల ఆ ఆటంకాలు వాటంతటవే తొలగిపోయాయని ఆయన అన్నారు. ఆటంకాలన్నీ తొలగిపోయి ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు కలగడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ఆరోగ్య శ్రీ వంటి పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X