మాజీ ఆర్మీ ఉద్యోగి కొండల్ రెడ్డి అరెస్టు?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు యువకులకు వరంగల్లో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి వద్ద రూ.2లక్షల చొప్పున వసూలు చేసి, మరో మాజీ ఆర్మీ ఉద్యోగి యశ్పాల్సింగ్కు ఆ యువకులను అప్పగించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలో బోగస్ నివాస ధ్రువపత్రాలు ఇప్పించినట్లు సమాచారం.
పోలీసులపై దాడి జరిగిన అనంతరం కొండల్ రెడ్డి, యశ్పాల్సింగ్ పరారయ్యారు. కొండల్రెడ్డి టైలర్స్ట్రీట్లో ఓ లాడ్జ్లో ఉన్నాడని సమాచారం అందింది. దీంతో హన్మకొండ సీఐ శోభన్ కుమార్ ఆధ్వర్యంలో లాడ్జ్పై దాడిచేసి కొండల్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగాల కోసం తయారు చేయించిన బోగస్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Comments
Story first published: Tuesday, April 20, 2010, 10:47 [IST]