హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రిపుల్ ఐటి సీట్లపై రోశయ్యపై జగన్ గుర్రు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ట్రిపుల్ ఐటి సీట్లను తగ్గిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ట్రిపుల్ ఐటిల్లో 50 శాతం సీట్లను తగ్గిస్తూ గురువారం ముఖ్యమంత్రి కె. రోశయ్య అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ట్రిపుల్ ఐటిలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేశారు. నిధులు సమకూర్చడం కష్టంగా ఉందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఐటి సీట్లను తగ్గించాలని నిర్ణయించింది. ట్రిపుల్ ఐటిలను క్రమంగా మూసే వేసేందుకే ప్రభుత్వం నడుం కట్టిందని వైయస్ జగన్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిటన్లు సమాచారం. ఈ విషయంపై యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీకి ఫిర్యాదు చేయాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఐటిల్లో మూడు వేల సీట్లను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

క్రమంగా ట్రిపుల్ ఐటి సంస్థలను మూసేసి ఇంజినీరింగ్ కళాశాలలుగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇడుపులపాయ, బాసర, నూజివీడులలో ప్రస్తుతం ఉన్న ట్రిపుల్ ఐటి భవనాలు ఇంజనీరింగ్‌ కళాశాలలకు సరిపోతాయని అఖిలభారత సాంకేతిక విద్యామండలి నుంచి అనుమతి పొంది ఈ మూడు ఐఐఐటిలను ఇంజనీరింగ్‌ కళాశాలలుగా మార్చే విషయంపై ప్రభుత్వం ప్రాథమికంగా చర్చలను ప్రారంభించినట్టు తెలిసింది. ఈ మూడు సంస్థలను ఇంజనీరింగ్‌ కళాశాలలుగా మార్చి బాసరలోని ఐఐఐటిని నిజామాబాద్‌లోని తెలంగాణా విశ్వవిద్యాలయం పరిధిలోకి, ఇడుపులపాయలోని కేంద్రాన్ని యోగివేమన పరిధిలోకి, నూజివీడులోని ఐఐఐటిని కృష్ణా యూనివర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్‌ కళాశాలలను మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X