హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జన్మభూమితో బాబు భ్రష్టుపట్టించారు: ధర్మాన

By Pratap
|
Google Oneindia TeluguNews

Dharmana Prasad Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మభూమి పేరుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ప్రజాపథం కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజాపథం నడుస్తున్న తీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. చంద్రబాబుకు ప్రజాపథాన్ని విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు.

ప్రజాఫథాన్ని బహిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చెప్పడం తప్పని ఆయన అన్నారు. ప్రజా పథాన్ని బహిష్కరించాలని చెప్పిన తెరాసను ప్రజలు పక్కన పెడతారని ఆయన అన్నారు. ప్రజాపథం నిర్వహిండమంటే కార్యాలయంలో కూర్చుని విమర్శించడం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X