హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యవాదం ధైర్యమైన నిర్ణయమే: చిరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: సమైక్యవాదం వినిపించాలని అనుకోవడం ధైర్యమైన నిర్ణయం కాదా అని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు.ధైర్యంగా రాజకీయ విమర్శలు చేయలేకపోతున్నానని తన గురించి కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, ప్రజలకు మేలు జరిగేటట్లయితే ఎంతటి వారికైనా ఎదురు తిరిగే ధైర్యం తనకుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమైక్యవాదం వినిపిస్తున్నామని, ఇది ధైర్యమైన నిర్ణయం కాదా అని అడిగారు. పార్టీని ప్రజల చేతిలో ఆయుధంగా మార్చాలని, అలా చేస్తే ఇక ఎదురుండదని సూచించారు. పార్టీపై, నాయకుడిపై వచ్చే విమర్శల్ని ఇక నుంచి దీటుగా తిప్పికొట్టాలని సూచించారు.

గత ఎన్నికల సమయానికి పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసుకోలేకపోయామని, ఓట్లు, సీట్లు రాకపోవటానికి ఇదే కారణమని చిరంజీవి అన్నారు. పార్టీపరంగా అనేక లోపాలు జరిగాయని అంగీకరించారు. పోలవరం సాధన ఉద్యమంపై గుంటూరు, ప్రకాశం జిల్లాల కమిటీల సభ్యులతో బుధవారం చిరంజీవి సమావేశమయ్యారు. పండిన పంటను ఇంటికి చేర్చుకోలేకపోవటమే తమ ఓటమికి కారణమని అన్నారు. తమ పార్టీ బాల్యదశ దాటి యవ్వన దశలోకి ప్రవేశిస్తోందని, తాను సైతం ఇతర రాజకీయ నాయకులతో పోలిస్తే యవ్వనంలోనే ఉన్నానని చిరంజీవి వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X