వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపిపై సోనియాకు హర్షకుమార్ ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Harsha Kumar
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావుపై కాంగ్రెసు అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వైఎస్ పాలన తర్వాత రోశయ్య పాలన వచ్చినా పరిస్థితిలో మార్పు లేదని, ప్రభుత్వ సలహాదారుగా కేవీపీ మాటే చెల్లుతోందని ఆయన అన్నారు. ఇటీవల కేవీపీ పార్లమెంట్‌లో పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్‌ఛార్జి నాచియప్పన్‌తో కలిసి డీఆర్‌వోల జాబితా తయారు చేశారని, పార్టీలోనూ ఆయన ఆధిపత్యమే కొనసాగుతోందని హర్షకుమార్ తెలిపారు.

ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల నియామకంలో దళితులకు తీరని అన్యాయం జరుగుతున్నదని, పోలీసు అధికారుల ప్రమోషన్లకు రూ.కోటి చొప్పున ముడుపులు తీసుకుంటున్నట్లు తెలిసిందని, ప్రిన్సిపల్ కార్యదర్శి జన్నత్ హుస్సేన్, కేవీపీ కలిసి ఈ బదిలీలను చేయించారని ఆరోపించారు. కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి కూడా సోనియాను కలిసి నేదురుమల్లిపై ఫిర్యాదు చేశారు. చిల్లకూరు ఎస్ఈజడ్‌లో అక్రమాలకు పాల్పడ్డవారు ఆయన అండతో బయటపడ్డారని తెలిపారు. ఎంపీ రత్నాబాయి, పార్టీ నేత మహమ్మద్ జానీ కూడా సోనియాను కలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X