గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ లా మారాల్సిన అవసరం లేదు: నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana
గుంటూరు: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావులా మాస్ లీడర్ లా ఎదగాల్సిన అవసరం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. గోదావరి నదీ జలాలు తొలుత తెలంగాణకే ఇవ్వాలని ఆయన గురువారం ఉదయం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణకు రాజకీయ పరిష్కారమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యవసరమైన పరిస్థితిలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐపియల్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మీద ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కుతోందని ఆయన విమర్శించారు. ఐపియల్ వ్యవహారానికి కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని అదుపు చేయడంలో విఫలమైందని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే ఐపియల్ వంటి వ్యవహారాలను ఎదిరించగలమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X