అభద్రత వల్లే చిరుకు అడ్డంకులు: ఉండవల్లి

Undavalli Arun Kumar
న్యూఢిల్లీ: అభద్రత వల్లనే తెలంగాణలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పర్యటనలను అడ్డుకుంటున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉన్నంత వరకే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉనికి ఉంటుందని ఆయన శుక్రవారం ఓ ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను విమర్శించే హక్కు కెసిఆర్ కు లేదని ఆయన అన్నారు. యుపిఎ భాగస్వామ్య పక్షాలు ఉనికి ఉంటుందని ఆయన అన్నారు. నాలుకలు కోస్తామని అనడం తప్ప కెసిఆర్ ఎప్పుడైనా తమతో సామరస్యంాగ ఎనాడైనా మాట్లాడారా అని అడిగారు.

హైదరాబాద్ చాలా సున్నితమైన అంశమని, రాష్ట్ర శాసనసభలో మెజారిటీ ప్రతినిధులు విలీనానికి అనుకూలంగా ఓటు వేశారని ఆయన చెప్పారు. తెలంగాణను కోస్తాంధ్ర వాళ్లు దోచుకున్నారనేది అవాస్తమని ఆయన అన్నారు. రాష్టాన్ని నాలుగు ముక్కలు చేసినా తమకు అభ్యంతరం లేదని, అయితే తమపై చేస్తున్న ఆరోపణలే బాధిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము అడ్డేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలకు తాను వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. తాను పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+