కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ మాటలు నమ్మకండి: మావోయిస్ట్ సాగర్

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఆళ్లగడ్డ: వైయస్ జగన్, కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ మాటలు నమ్మవద్దని మావోయిస్టు సాగర్ ప్రజలను కోరారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం యల్లావత్తుల గ్రామానికి చెందిన మంగలి వెంకటస్వామి పోలీస్ ఇన్‌ ఫార్మర్‌ గా ఉన్నాడన్న నేపంతో 2004, ఆగస్టు 25వ తేదీన సాగర్ ఆయన్ను కిడ్నాప్ చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రుద్రవరం పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా పోలీసులు మంగళవారం ప్రత్యేకవాహనంలో సాగర్‌ను ఆళ్లగడ్డకు తీసుకువచ్చారు.

కోర్టులోకి వెళుతున్న సాగర్ "మావోయిస్ట్ పార్టీ జిందాబాద్, రాయలసీమ హక్కుల కోసం పోరాడాలి, మావోయిస్ట్‌ లపై అక్రమ కేసులు ఎత్తివేయాలి' అంటూ నినాదాలు చేశారు. కోర్టులో హాజరైన అనంతరం విలేఖరులతో సాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వనరులు, సంపద కేవలం నూటిలో పది మందిగా ఉన్న రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు చెందిన సంపన్న వర్గాలు అనుభవించడానికి తీసుకున్నదే సమైక్యాంధ్ర నినాదమన్నారు.

అందుకే రాయలసీమ ప్రజలు, మేధావులు, విద్యార్థులు, జర్నలిస్టులు రాయలసీమ సార్వభౌమాధికారం కోసం, హక్కుల కోసం పోరాడలన్నారు. సంపన్న వర్గాల ప్రతినిధులుగా ఉన్న టీజీ వెంకటేష్, వైయస్ జగన్‌ ల వంటి వారి మాటలు నమ్మ వద్దని కోరారు. గ్రీన్‌ హంట్ సామ్రాజ్య వాదులకు కార్పోరేట్ సంస్థలకు సంబంధించిన అనుకూమైనటువవంటి దుర్మాగ్గమైన యుద్ధమన్నారు. కాగా, ఈ కేసు ఈ నెల 17వ తేదీ వాయిదా వేశారని కోర్టు వర్గాలు తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X