వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్ళి బృందం బస్సు బోల్తా

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: భారీ వర్షాల కారణంగా పెళ్లి బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బుచ్చెయ్యపేట మండలం గంటికొర్లాం గ్రామానికి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 30మంది స్వల్పంగా గాయపడ్డారు. బాధితులందరూ మహిళలూ, చిన్నారులే. పెళ్లికుమారుని గ్రామమైన గంటికొర్లాంలో గురువారం రాత్రికి పెళ్లి జరగాల్సివుంది. పెళ్లి కుమార్తె తరపు బంధువులు పరవాడ మండలం దువ్వాడ సమీపంలోని అదనగిరి గ్రామం నుంచి రెండు ప్రైవేటు బస్సుల్లో వెళుతుండగా, ఎదురుగా వస్తున్న మోటారు సైకిలిస్టును తప్పించబోయి ప్రమాదవశాత్తు మహిళలు, చిన్నారులు ఉన్న బస్సు బోల్తా పడింది.

భారీ వర్షాలకు రోడ్డు అంచున వేసిన మట్టి కూరుకుపోవడంతో బస్సు ఒక పక్కకు ఒరిగిపోయి సమీపంలోని పొలాల్లోకి పల్టీకొట్టింది. ఈ బస్సులో సుమారు 60 మంది ఉన్నారు. డోర్లు ఉన్న వైపు బస్సు బోల్తాపడడంతో లోపల ఉన్న వారు బయటకు రావడానికి నానా అవస్థలు పడ్డారు. ప్రాణభయంతో పెద్ద పెట్టున కేకలు పెట్టారు. గ్రామస్తులు పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి లోపల ఉన్న వారిని రక్షించారు.

ఒకరిపై ఒకరు పడిపోవడవంతోపాటు అద్దాలు పగిలి, రేకులు గీసుకొని మొత్తం 30మందికి గాయాలయ్యాయి. బంటు పద్మ, బొడ్డేపల్లి రమణమ్మ, అమరిపల్లి లకి, నారపల్లి రమణమ్మ, బంటు సత్యవతి, ఇందలి రమణమ్మ, బలిరెడ్డి పైడమ్మ, గేదెల లకి, లక్క వరహాలమ్మ, గేదెల రత్నంలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆటోల్లోను, కారుల్లోను విశాఖపట్నం తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X