విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ జిల్లాలో ప్రియురాలిపై హత్యాయత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

vishakhapatnam
విశాఖపట్నం: ప్రియురాలికి విషగుళికలు ఇచ్చి హత్యాయత్నానికి పాల్పడిన యువకుడి ఉదంతం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం ఉళ్లూరు గ్రామంలో జరిగింది. కుమారి అనే యువతిని ప్రేమించి, ఆమెను గర్భవతిని చేసిన సంజీవ్ కుమార్ హత్యాయత్నానికి ఒడిగట్టాడు. సంజీవ్ కుమార్ ఇచ్చిన మాత్ర మింగిన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రిలో కుమారి మృతశిశువుకు జన్మనిచ్చింది. కుమారి మాత్రం కోలుకుంటోంది.

లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ పై కుమారి అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంజీవ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రేమిస్తున్నానంటూ సంజీవ్ కుమార్ 2008 నుంచి తన వెంట పడుతున్నాడు. అతని ఒత్తిడి మేరకు తాను ఒప్పుకున్నానని, 2009లో బలవంతంగా తనతో శారీరక వాంఛ తీసుకోవడం మొదలు పెట్టాడని కుమారి అంటోంది. చివరకు గర్భం రావడంతో తనను హత్య చేయడానికి పూనుకున్నాడని ఆమె చెబుతోంది. సంజీవ్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X