వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మృతుల్లో ఎక్కువ మంది మలయాళీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Air India Express Aircraft
మంగుళూరు: మంగుళూరు విమానప్రమాద దుర్ఘటనలో మృతిచెందిన 159 మందిలో అధికశాతం మంది కేరళకు చెందినవారని ఎయిర్‌ ఇండియా డైరక్టర్‌ అనూప్‌ శ్రీవాస్తవ తెలిపారు. మృతుల్లో 19మంది పిల్లలుకాగా నలుగురు శిశువులు ఉన్నారని ఆయన తెలిపారు. సహాయక బృందాలను ముంబయినుంచి మంగుళూరుకు ప్రత్యేక విమానంలో పంపామన్నారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారని ముందే దానిపై వ్యాఖ్యానించటం సరికాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

మంగుళూరులో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 173 మంది ప్రయాణీకులు ఉండగా 9మంది వరకు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది ముందు మంటలను అదుపుచేశారు. ఆ తర్వాత 90 మృతదేహాలను బయటకు తీశారు.

మంగుళూరులో జరిగిన విమానప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. మృతి చెందిన ఒక్కొక్కరి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియానుఅందజేస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X