హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన మరో విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఆరు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన విద్యార్థి హైదరాబాద్‌లోని పంజాగుట్టకు చెందిన వెంపటి శ్రీరామచంద్రమూర్తి(21). ఉన్నత విద్య కోసం అతడు ఐదేళ్ల క్రితం అమెరికాలోని డల్లాస్‌కు వెళ్లాడు. అక్కడ టెక్సాస్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్స్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

రామచంద్రమూర్తి వారం కిందట కొత్త కారు కొన్నాడు. తల్లిదండ్రులు సత్యసూర్యనారాయణ, వసంత లక్ష్మి, సోదరి సాయికిరణ్‌లతోపాటు భారత కాలమానం ప్రకారం ఈ నెల 15న ఉదయం డల్లాస్‌ నుంచి ఆ కారులో విహారయాత్రకు బయల్దేరాడు. మార్గ మధ్యంలో మలుపు వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో రామచంద్రమూర్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 16వ తేదీ సాయంత్రం చనిపోయాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X