జగన్ ఓదార్పునకు హైకమాండ్ ను ఒప్పిస్తాం: ఉండవల్లి అరుణ్ కుమార్

Undavalli Arun Kumar
రాజమండ్రి: జగన్ ఆలోచనల్ని అమలుపరిచేలా అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు కృషి చేస్తానని కాంగ్రెసు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. వైయస్ పథకాల అమలుకు ఒత్తిడి చేస్తానన్న జగన్‌ కు అండగా నిలబడి ముఖ్యమంత్రి రోశయ్య, పార్టీ అధ్యక్షురాలు సోనియా వద్దకు వెళ్తామన్నారు. జగన్ వ్యవహారంలో పత్రికలు సంక్షోభాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని బుధవారం రాజమండ్రిలో జరిగిన ఓ సదస్సులో విమర్శించారు.

ఊహించని పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఉన్న రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. మనిషంటే వైయస్సేనని, చక్కటి పాలన అందించారని కొనియాడారు. నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరించే ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాలు మనకు కావాలని సీఎం రోశయ్య తనతో చెప్పారని ఏపీఐఐసీ చైర్మన్ ఎస్.శివరామసుబ్రహ్మణ్యం అన్నారు. సలహాలిచ్చేందుకు ఉండవల్లిని దగ్గరుండి తన వద్దకు తీసుకు రావాలని రోశయ్య చెప్పారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+