తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కాంగ్రెసు రక్తం ఉంది, పార్టీని వీడరు: విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
తిరుపతి: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రక్తంలో కాంగ్రెసు ఉందని, అందువల్ల జగన్ పార్టీని వదిలిపెట్టరని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. జగన్ కాంగ్రెసులోనే కొనసాగుతారని ఆయన అన్నారు. ఆయన శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ సొంత పార్టీ పెడతారని తాను అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కాంగ్రెసు పార్టీకి విడదీయరాని సంబంధం ఉందని, వైయస్ బాటలోనే జగన్ పయనిస్తారని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. అధిష్టానం నిర్ణయం మేరకే తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X