హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గెలిచి వచ్చి అసెంబ్లీలో అగ్గి రాజేస్తాం: కె. చంద్రశేఖర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చి తెలంగాణ సమస్యలపై శాసనసభలో అగ్గి రాజేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసితో తాము కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ జెఎసి అంటే తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అని ఆయన అన్నారు. కేంద్రం, ఇతర రాజకీయ పార్టీల దిమ్మ తిరిగేలా ప్రజలు తీర్పునివ్వాలని ఆయన కోరారు.

ఉప ఎన్నికల తర్వాత జెఎసి నాయకులతో కలిసి అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తామని ఆయన చెప్పారు. జెఎసి జెండాను ప్రతి గ్రామంలో ఎగురేస్తామని ఆయన చెప్పారు. విద్యార్థుల ప్రజా చైతన్య యాత్రలకు విశేష స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్ దక్కకుండా పనిచేయాలని విద్యార్థులు కోరకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాజీనామా చేసిన నాయకులను ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజల ఆకాంక్ష కేంద్రానికి, శ్రీకృష్ణ కమిటీకి తెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం భయాందోళనలకు గురి చేస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X