నిత్యానంద విడుదల, ఆశ్రమంలో పంచ తపస్య యాగం

తరువాత నిర్ణయం మార్చుకుని నిత్యానంద న్యాయవాదులు ప్రవీణ్, వివేకానంద గుప్తలు నేరుగా శనివారం మధ్యాహ్నం రామనగర జైలు వద్దకు వెళ్లి బెయిలు ప్రతిని అధికారులకు చూపించారు. నిత్యానందకు 23వ తేదీ వరకు రిమాండ్ ఉందని అధికారులు చెప్పటంతో మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్లి బెయిల్ ప్రతిని, ఇద్దరి పూచీకత్తు పత్రాలను అందించారు. అక్కడ నిత్యానంద విడుదలకు అనుమతి పత్రం తీసుకుని ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. ఆదివారం (నేడు) సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిత్యానంద పంచతపస్య యాగాన్ని చేయనున్నారు. తన చుట్టూ దడిలాగా మండే నిప్పుల కంచెను ఏర్పాటు చేసుకుని దాని మధ్యలో ఆయన కూర్చొని ఈ యాగాన్ని చేయనున్నట్లు సమాచారం. కంచె నుంచి మంటలు మూడడుగుల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications