పొన్నాల లక్ష్మయ్య ఎపిసోడ్ లో చిరంజీవి ఫ్యాక్టర్

కాగా, జలయజ్ఞం విషయంలో అధికార పార్టీ నాయకులే ఆరోపణలు చేస్తుండడంతో పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సీమాంధ్ర నాయకులు మద్దతు, మంత్రుల మద్దతు ఆయనకు లభిస్తున్నప్పటికీ వస్తున్న ఆరోపణల తీవ్రతను తగ్గించే పరిస్థితి లేదు. జలయజ్ఞంలో అవినీతి జరిగిందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని పాల్వాయి గోవర్దన్ రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పొన్నాల తాను చెప్పినట్లుగా సమావేశం ఏర్పాటు చేస్తే ఆధారాలను ముందు పెడతానని ఆయన చెప్పారు. ఇటు అధికార పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తుండడంతో తెలుగుదేశం, ఇతర ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వంపై దాడి చేయడానికి పదునైన ఆయుధం లభించినట్లయింది. జలయజ్ఞంలో అవినీతి చోటు చేసుకుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు పొన్నాలపై, రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ దాడిని ఉధృతం చేసింది.












Click it and Unblock the Notifications