హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడియో పైరసీ నివారణకు చట్ట సవరణ చేస్తాం: గీతా రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Geetha Reddy
హైదరాబాద్: వీడియో పైరసీ నివారణకు చట్ట సవరణ చేయనున్నట్లు రాష్ట్ర సమాచార, పౌర సబంధాల మంత్రి గీతా రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. వీడియో పైరసీ నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఇప్పటి వరకు ఉన్న చట్టానికి సవరణలు తేవాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. సవరించిన చట్టం ప్రకారం వీడియో పైరసీదారులను పట్టుకునే అధికారం ఎస్ఐలకు కూడా ఉంటుందని అమె చెప్పారు.

డిఎస్సీ - 2008కి సంబంధించి 30 వేల ఎస్జీటి పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు ఆమె తెలిపారు. కడప జిల్లాకు వైయస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే, వచ్చే నెల 7వ తేదీ నుంచి శాసనసభా సమావేశాలు నిర్వహించాలని కూడా సమావేశం నిర్ణయించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X