పట్టు వీడని కాంగ్రెసు సీనియర్లు: కేశవరావుతో భేటీ
సీనియర్ నేతలు నర్సారెడ్డి, పాల్వాయి గోవర్థన్రెడ్డి, ఎంపీ గుత్తాసుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, ఇంద్రసేన్రెడ్డి, కమలాకరరావు తదితరులు కేకేను కలిసిన వారిలో ఉన్నారు. పోలవరం డిజైన్ మార్పు, జలయజ్ఞం అక్రమాలపై పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీనియర్లు ఈ భేటీలో దానికి తుది రూపు నిచ్చే అవకాశాలున్నాయి. వచ్చే నెల 5,6,7 తేదీల్లో శ్రీకృష్ణ సంఘం ముందు ఉంచాల్సిన వాదనలకు సంబంధించి రూపొందించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్కు ఈ భేటీలో తుది మెరుగులు దిద్దనున్నారు. దీనితో పాటు కమిటీ ముందుకు సీమాంధ్ర నేతలతో కలసి వెళ్లాలన్న ప్రతిపాదనపై కూడా నేతలు చర్చించనున్నారు.
Comments
కాంగ్రెసు కేశవరావు పోలవరం శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్ congress keshav rao polavaram srikrishna committee hyderabad
Story first published: Monday, June 21, 2010, 15:23 [IST]