హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ నుంచి ఇండియాలో ఫేస్ బుక్ కార్యకలాపాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Facebook
హైదరాబాద్: సోషియల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ తన ఇండియా కార్యకలాపాలను ప్రారంభించనుంది. హైదరాబాదు నుంచి తన భారత కార్యకలాపాలను రెండు నెలల లోగా ప్రారంభించడానికి ఫేస్ బుక్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఫేస్ బుక్ యూనిట్ ను రహేజ్ మైండ్ సెట్ సెజ్ లో స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించినట్లు ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ సీనియర్ అధికారి చెప్పారు. ఇందుకు గాను కంపెనీ ఉద్యోగులను నియమించుకుంటోంది. తొలుత తన కార్యకలాపాలను ఈ సంస్థ సెజ్ లోని ఇంకుబేషన్ సెంటర్ నుంచి కొనసాగిస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెజ్ ల్లోని 3.91 లక్షల చదరవు గజాల స్థలంలో పలు ఐటి కంపెనీలు తమ కార్యాలయాలను స్థాపించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐటి బహుళ జాతి సంస్థలు ఎక్సెంచర్, ఇన్వెస్కోలు కూడా తమ కార్యాలయాలను నెలకొల్పనున్నాయి. ఫేస్ బుక్ కు భారత్ లో దాదాపు 8 మిలియన్ సబ్ స్క్రయిబర్లున్నారు. తొలి దశలో సంస్థ భారత్ లో 150 మిలియన్ల అమెరికా డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. హైదరాబాదులో కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా భారత ఆపరేషన్లను నడిపిస్తామని ఫేస్ బుక్ ఇటీవలే ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X