తెలంగాణ పట్ల ప్రభుత్వం దుర్మారం చేస్తోంది: కె చంద్రశేఖర రావు

ఇదిలావుంటే, తెలంగాణకు చెందిన 160 మంది తహిసల్దార్లకు ప్రభుత్వం ప్రమోషన్ నిరాకరించిందని, దీనివల్ల వారు డిప్యూటీ కలెక్టర్లు కాలేకపోయారని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల అన్యాయాల పరంపర కొనసాగుతూ ఉన్నదని ఆయన విమర్సించారు. ఏయే జిల్లాలో ఎంత మందికి ప్రమోషన్ నిరాకరించారో ఆయన వివరించారు. తెలంగాణ తహిసల్దార్లకు ప్రమోషన్లు నిరాకరించి తెలంగాణేతర తహిసల్దార్లకు ప్రమోషన్లు ఇవ్వడం వల్ల తెలంగాణ తహిసల్దార్లు తమకన్నా జూనియర్ల కింద పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications