హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెవిపి భేటీ: వైయస్ జగన్ ఇంటి వద్ద నేతల సందడి

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
హైదరాబాద్: పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరిస్తూ రేపటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను దివంగత నేత వైయస్ ప్రియ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు బుధవారం కలిశారు. కెవిపి జగన్ తో ఏం మాట్లాడారనేది తెలియడం లేదు. అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరించవద్దని ఆయన జగన్ కు సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, వైయస్ జగన్ ఇంటి వద్ద కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, అభిమానులు సందడి చేస్తున్నారు. పలువురు నాయకులు వైయస్ జగన్ ను కలుసుకున్నారు. శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, రాజిరెడ్డి, బాలూనాయక్, శ్రీశైలం గౌడ్, శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బిక్షపతి యాదవ్, ఆదినారాయణ రెడ్డి తదితరులు బుధవారం జగన్ ను కలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించడానికి బుధవారం సాయంత్రం జగన్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైల్లో బయలుదేరాల్సి ఉంది. ఓదార్పు యాత్రపై తన అనుచరులతో జగన్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X