శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాకుళం జిల్లాలో జగన్ రెండో రోజు యాత్ర కూడా విజయవంతం

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
టెక్కలి: జగన్ రెండో రోజు ఓదార్పు యాత్ర కూడా విజయవంతమైంది. యువనేతకు ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు. ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చారు. రెండోరోజు ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్‌ శుక్రవారం టెక్కలి రైల్వేగేటు వద్ద వైయస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం జగన్‌ మాట్లాడుతూ మీరు చూపిస్తున్న ఆదరణ, అభిమానానికి తాను ఏమీచ్చినా రుణం తీర్చుకోలేనన్నారు. 'నాన్న చనిపోలేదు.. ఆయన మీ అందరి గుండెల్లో ఉన్నాడని మీ ఆప్యాయత, ఆదరణ చూస్తే తెలుస్తోంది..' అంటూ ఆయన రెండు చేతులెత్తి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం జగన్‌ కొత్తపేటకు బయలుదేరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X