ఇస్లామాబాద్: పాకిస్ధాన్లో ఒక ప్రమాదంలో 45 మంది మరణించారు. గిరిజన గ్రామంలో జరిగిన ఆత్మాహుతి బాంబుదాడిలో 45 మంది మృతి చెందగా 90 మంది వరకు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్, పాక్ సరిహద్దులో ఉన్న యాంగుంద్ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. మోటారుసైకిల్పై వచ్చిన ఓ వ్యక్తి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తనను తాను పేల్చుకున్నాడు.
అక్కడ ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వేచి ఉన్నారు. అనేక దుకాణాలు కూడా ఉండటంతో ఆ సమయంలో రద్దీగా ఉంది. ఈ పేలుడు ధాటికి అక్కడే ఉన్న జైలు గోడ కూలిపోవటంతో పలువురు ఖైదీలు పారిపోయారు.